Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో వున్న కూతురు.. పొట్టపై కత్తితో పొడిచి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

father
Webdunia
గురువారం, 18 జులై 2019 (11:36 IST)
మహారాష్ట్రలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకుని గర్భంతో వున్న సమయంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఓ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె పట్ల తండ్రే యముడై కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, గట్కోబర్ ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ కుమార్ కుమార్తె మీనాక్షి (20). ఈమె అదే ప్రాంతానికి చెందిన బ్రిజేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 
 
ఈ విషయం తండ్రికి తెలియడంతో.. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందని.. పరువు పోతుందని భావించాడు. వీరి వివాహానికి అడ్డుచెప్పాడు. కానీ ప్రేమించి వివాహం చేసుకున్న మీనాక్షి గర్భంతో వున్నానని చెప్పేందుకు స్వగ్రామానికి వచ్చింది. 
 
అలా వచ్చిన కూతురిని ఇంటికి తీసుకుపోని ఆమె తండ్రి రాజ్ కుమార్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూతురు కడుపుతో వుందనే కనికరం లేకుండా కత్తితో పొట్టపై పొడిచి ఘోరంగా హత్య చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మీనాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపారు. రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments