Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో వున్న కూతురు.. పొట్టపై కత్తితో పొడిచి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 18 జులై 2019 (11:36 IST)
మహారాష్ట్రలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకుని గర్భంతో వున్న సమయంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఓ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె పట్ల తండ్రే యముడై కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, గట్కోబర్ ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ కుమార్ కుమార్తె మీనాక్షి (20). ఈమె అదే ప్రాంతానికి చెందిన బ్రిజేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 
 
ఈ విషయం తండ్రికి తెలియడంతో.. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందని.. పరువు పోతుందని భావించాడు. వీరి వివాహానికి అడ్డుచెప్పాడు. కానీ ప్రేమించి వివాహం చేసుకున్న మీనాక్షి గర్భంతో వున్నానని చెప్పేందుకు స్వగ్రామానికి వచ్చింది. 
 
అలా వచ్చిన కూతురిని ఇంటికి తీసుకుపోని ఆమె తండ్రి రాజ్ కుమార్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూతురు కడుపుతో వుందనే కనికరం లేకుండా కత్తితో పొట్టపై పొడిచి ఘోరంగా హత్య చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మీనాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపారు. రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments