Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తె.. కిరోసిన్ పోసి నిప్పంటించిన..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (13:00 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తో గడిపిన కుమార్తెకు ఓ తండ్రి కఠినంగా శిక్షించాడు. ఏకంగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై, విరార్ ప్రాంతంలో కూలీపనిచేసే మొహ్మద్ మన్సూర్ అనే వ్యక్తి.. తన భార్య, కుమార్తెతో నివాసముంటున్నాడు. మన్సూర్ కుమార్తె సాయేషా (16) గంటల పాటు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. 
 
ఎంత చెప్పినా సాయేషా ఫోనులో మాట్లాడటాన్ని తగ్గించలేదు. దీంతో ఆవేశానికి గురైన మన్సూర్.. సెల్‌ఫోన్‌ను లాక్కుని.. దాంతోనే సాయేషా తలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతికి దొరికిన కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పంటించేశాడు. 
 
ఈ ఘటనను కళ్లారా చూసిన సాయేషా తల్లి.. లబోదిబోమంటూ.. స్థానికుల సాయంతో సాయేషాను ఆస్పత్రికి తరలించింది. తీవ్రగాయాలతో సాయేషా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుమార్తెపై హత్యాయత్నానికి ప్రయత్నించడంతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments