Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికను హత్య చేసిన తండ్రి.. ఇడ్లీ పార్శిల్ తీసుకెళ్లి..?

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (10:44 IST)
ఆరేళ్ల బాలికను ఓ తండ్రి హత్య చేసి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లాతూర్ నగరంలోని మోతీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అభయ్ లఖన్ భూతాడ మోతీనగర్‌లోని రాంకాశి భవనంలో అద్దెకు నివసిస్తున్నాడు. మృతుడు అభయ్ భూతాడ ఇంటి సమీపంలో అల్పాహార కేంద్రం దుకాణం ఉంది. 
 
ఉదయం కూతురిని స్కూల్‌లో దింపేందుకు దుకాణం నుంచి ఇంటికి వెళ్లాడు. దారిలో కూతురికి ఇడ్లీ పార్శిల్ కూడా తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అతను తన కుమార్తె నౌవ్య అభయ్ భుత్డా (6 సంవత్సరాల వయస్సు)ను ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు పక్కన ఉన్న రాడ్‌కు వేలాడదీసి ఉరివేసి.. మరోవైపు అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 
 
ఆత్మహత్య చేసుకున్న సమయంలో అభయ్ భుతాడ భార్య ఇంట్లో లేదు. పక్కనే ఉన్న తన పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
గోవింద్ పాండురంగ్ ముండాడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికను హత్య చేసినందుకు మృతుడు అభయ్ లఖన్ భుత్డాపై గాంధీచౌక్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. తదుపరి విచారణను అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉజాగెరే నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments