Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ అప్‌‍డేట్ చేయకుంటే డీయాక్టివేట్ : ఎన్.హెచ్.ఏ.ఐ

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (20:06 IST)
ఫాస్టాగ్ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని పూర్తి చేయని ఫాస్టాగ్‌లును పూర్తిగా బ్లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 31వ తేదీలోగా కేవైసీ అప్‌‍డేట్ చేయని ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
 
కేవైసీ పూర్తి చేయకుంటే ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉన్నా వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని, ఈ అసౌకర్యాన్ని నివారించుకోవాలంటే యూజర్లు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎన్.హెచ్.ఏ.ఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజా లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని సూచించింది. 
 
వాహనదారులు కొన్నిసార్లు ఫాస్టాగ్‌లను వాహనం ముందు పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతున్నారని... దాంతో టోల్ ప్లాజాలలో ఆలస్యం కావడంతో పాటు అందరినీ అసౌకర్యానికి గురిచేస్తోందని పేర్కొంది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు... ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని... ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments