Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజేంద్ర సింగ్ కుటుంబానికి రూ.5లక్షల సాయం: పోలీసుల వెనకడుగు!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:28 IST)
భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్వహించిన కిసాన్ ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రాజస్థాన్‌ రైతు గజేంద్రసింగ్‌ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ.5 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. గజేంద్ర మరణం తననెంతో బాధించిందని అతడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 
 
ఆద్మీ పార్టీ కార్యకర్తల కారణంగానే రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ను రక్షించలేకపోయామని, వారి ప్రోద్బలంతోనే గజేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ, ఈ విషయంలో ఆప్ ప్రకటించిన మెజిస్టీరియల్ విచారణకు సహకరించబోమని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు.
 
ఇన్ స్పెక్టర్ ఎస్ఎస్ యాదవ్ తయారు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, గజేంద్ర చెట్టు ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతున్న వేళ, ఆ సమాచారం తెలిసినా... వేదికపై ఉన్న ఆప్ నేతలు పట్టించుకోలేదని, చెట్టుపై నుంచి మృతదేహాన్ని దింపేందుకు ఫైరింజన్‌ను తీసుకురావాలని తాము చేసిన ప్రయత్నాలను ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారని వివరించారు. గజేంద్ర మెడకున్న గుడ్డను కార్యకర్తలు తొలగించగా, ఒక్కసారిగా దేహం నేలపై పడిపోయిందని చెప్పారు. మొత్తం ఘటనలో ఆప్ నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments