Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధి గుండెపోటుతో మరణించినట్లు ఫేస్‌బుక్‌లో వార్తలు.. డీఎంకే షాక్

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై నానా రకాలుగా వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ వార్తలు ప్రస్తుతం డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గుండెపోటుతో కరుణానిధి మరణించినట్లు ఫేస్‌బుక్‌ల

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (16:08 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై నానా రకాలుగా వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ వార్తలు ప్రస్తుతం డీఎంకే చీఫ్ కరుణానిధివైపు మళ్లాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గుండెపోటుతో కరుణానిధి మరణించినట్లు ఫేస్‌బుక్‌లో వార్తలు రావడంతో కలకలం సృష్టించాయి. 'అమ్మా సింగం సవితా' ఐడీతో ఈ వార్తలను పోస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు ఆ ఫిర్యాదు స్వీకరించలేదని వాణియంబాడి డీఎంకే న్యాయవాదుల విభాగానికి చెందిన దేవకుమార్‌ ఆరోపిస్తున్నారు. 
 
కరుణానిధిపై వదంతులు సృష్టించిన సవితాపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నట్లు పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా కరుణానిధిపై వదంతులు సృష్టిస్తున్న వారిని కూడా అరెస్టుచేయాలని డిమాండ్‌ చేశారు
 
శనివారం ఉదయం అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్, తిరుపత్తూరు ఎమ్మెల్యే నల్లతంబి వేలూరు ఎస్పీ పగలవన్ వద్ద ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో వదంతులు పెట్టిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments