ఫేస్బుక్లో పరిచయం చేసుకుని స్వలింగ సంపర్కానికి ఉసికొల్పిన ముఠా అరెస్ట్
ఫేస్బుక్లో పరిచయం చేసుకుని.. ఆపై మోసానికి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వలింగ సంపర్కానికి ఉసికొల్పి యువకులను తమ ప్రాంతానికి రప్పించుకుని.. ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బు, సెల్ఫోన్లు దోచు
ఫేస్బుక్లో పరిచయం చేసుకుని.. ఆపై మోసానికి పాల్పడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వలింగ సంపర్కానికి ఉసికొల్పి యువకులను తమ ప్రాంతానికి రప్పించుకుని.. ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బు, సెల్ఫోన్లు దోచుకుని దాడిచేసి తరిమేస్తున్న ముఠాను కోవై పోలీసులు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ.లక్ష నగదు, ఒక బైకు, ఎనిమిది సెల్ఫోన్లు, పోలీసు డ్రస్, పోలీసు గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లాకు చెందిన మారిశ్వర కన్నన్ (30), తిరుపూర్లో ఒక ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్లో కోవై గణపతి ప్రాంతానికి చెందిన తరుణ్ కార్తిక్ పరిచయమయ్యాడు.
మారిశ్వర కన్నన్కు మాయమాటలు చెప్పి అతనిని స్వలింగ సంపరక్కానికి ఉసికొల్పి కోవై రావాల్సిందిగా కార్తిక్ ఆహ్వానించాడు. దీంతో కన్నన్ డిసెంబర్ ఒకటో తేదీన మేట్టుపాళయంకు వచ్చాడు. అతన్ని తరుణ్ కార్తిక్ అక్కడి దాసంపాళయం అనే గ్రామంలో మారుమూల ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరి కొందరు ఉన్నారు. వారిలో పోలీసు దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తాను మేట్టుపాళయం పోలీసు అని తప్పు చేయడానికి ఇక్కడి వచ్చావంటూ బెదిరించి కన్నన్ వద్ద ఉన్న వస్తువుల్ని లాక్కొన్నాడు. ఆపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆరు నెలలుగా పలువురిని ఫేస్బుక్లో పరిచయం చేసుకుని దాసపాళయంకు రప్పించి దోచుకుంటున్నారన్నారు. వీరిపై ఐదు విభాగాల కింద కేసును నమోదు చేశారు.