Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పనితీరుపై భారీ అంచనాలొద్దు: ఆర్బీఐ గవర్నర్

Webdunia
గురువారం, 21 మే 2015 (13:58 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనితీరుపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పనితీరుపై అవాస్తవిక అంచనాలను ప్రజలు, కార్పొరేట్లు పెంచుకున్నారని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడేలా అడుగులు పడుతున్నాయని రాజన్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో రాజన్ ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజన్ ఎకనామిక్ క్లబ్‌లో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం మోడీ కొత్త ప్రభుత్వాన్ని స్థాపించిన తరువాత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు పెరిగిపోయాయని, 'రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రజలకు ఎన్ని అంచనాలున్నాయో అన్ని అంచనాలను భారతీయులు మోడీపై పెట్టుకున్నారు' అని తెలిపారు. అయితే ఇలాంటి భారీ అంచనాలు సరికావని రాజన్ వివరించారు. సున్నితాంశాలపై ఇన్వెస్టర్ల మనోభావాలు దెబ్బతినకుండా ముందడుగు వేయడం కష్టమని ఆయన అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments