Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ తుది ఫలితాలను వెల్లడించిన ఎన్టీయే.. సుప్రీం తీర్పు మేరకు సవరణ!!

వరుణ్
గురువారం, 25 జులై 2024 (19:19 IST)
వైద్య విద్యా కోర్సు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను మరోమారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) గురువారం వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఫిజిక్స్‌‍లో అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను తొలగించి, తాజా ఫలితాలను విడుదల చేశారు. 
 
నీట్ ప్రశ్నపత్రంలోని 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల త్రిసభ్య కమిటీ ఆప్షన్ 4 సరైన సమాధానంగా పేర్కొంది. దాన్ని టిక్ చేసిన వారికే మార్కులు కేటాయించింది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన యూజీ ఎంట్రెన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
ప్రశ్నపత్ర లీక్, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ వంటి అంశాలు వెలుగుచూశాయి. పైగా, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను జూన్ 4వ తేదీనే విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఫలితాల్లో 67 మందికి 720కు 720 మార్కులు రావడంతో వారంతా టాపర్లుగా నిలిచారు. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 67 మంది టాపర్లలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంకును కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments