Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ తుది ఫలితాలను వెల్లడించిన ఎన్టీయే.. సుప్రీం తీర్పు మేరకు సవరణ!!

వరుణ్
గురువారం, 25 జులై 2024 (19:19 IST)
వైద్య విద్యా కోర్సు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను మరోమారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) గురువారం వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఫిజిక్స్‌‍లో అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను తొలగించి, తాజా ఫలితాలను విడుదల చేశారు. 
 
నీట్ ప్రశ్నపత్రంలోని 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల త్రిసభ్య కమిటీ ఆప్షన్ 4 సరైన సమాధానంగా పేర్కొంది. దాన్ని టిక్ చేసిన వారికే మార్కులు కేటాయించింది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన యూజీ ఎంట్రెన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
ప్రశ్నపత్ర లీక్, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ వంటి అంశాలు వెలుగుచూశాయి. పైగా, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను జూన్ 4వ తేదీనే విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఫలితాల్లో 67 మందికి 720కు 720 మార్కులు రావడంతో వారంతా టాపర్లుగా నిలిచారు. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 67 మంది టాపర్లలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంకును కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments