Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్ సింగ్?

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (18:25 IST)
ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (80)ను బరిలోకి దించనున్నారనే వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పదవికి 18న ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది.
 
అయితే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థిగా ఒడిశా గిరిజన సభ్యురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్ముని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీల సాధారణ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించారు.
 
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు ఓటేయనున్నారు. బలాబలాల దృష్ట్యా బీజేపీ బరిలోకి దిగిన అభ్యర్థి గెలుపొందడం ఖాయమని తేలిపోయింది. 
 
మరోవైపు, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రేసులో కాంగ్రెస్ అసమ్మతి నేత గులాంనబీ ఆజాద్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇపుడు కాంగ్రెస్‌ మాజీ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
 
ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని ప్రారంభించిన అమరీందర్ సింగ్.. బీజేపీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వెన్ను నొప్పికి చికిత్స చేయించుకునేందుకు యూరప్ దేశమైన లండన్, బ్రిటన్ వెళ్లారు. ఇటీవలే ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఫోన్‌లో సంప్రదించి ఆరోగ్యంపై ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments