Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక పీసీసీ చీఫ్‌పై రమ్య కామెంట్స్.. నెట్టింట వైరల్

Webdunia
శనివారం, 14 మే 2022 (10:18 IST)
కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సొంత పార్టీ నేతపై రమ్య సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రమ్య చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు రమ్య గురువారం కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్ ,పార్టీ ప్రచార కమిటీ చీఫ్ ఎంబి పాటిల్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం జరుగుతోంది. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ను కప్పిపుచ్చడానికి కర్ణాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ్‌తో "రహస్య సమావేశం" నిర్వహించారని పాటిల్ పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు చేయడంతో వీరిద్ద మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
 
ఈ క్రమంలో వాటిపై స్పందించిన రమ్య .. శివకుమార్ పై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "పార్టీలకు అతీతంగా ప్రజలు ఒకరినొకరు కలుస్తారు, ఫంక్షన్‌లకు వెళతారు, కొందరు కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటారు - నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శివకుమార్ గట్టి కాంగ్రెస్‌వాది అయిన పాటిల్ గురించి ఇలా అనడం. ఇలా అయితే ఎన్నికల్లో పార్టీ కలిసి పోరాటం చేయగలదా ? అంటూ రమ్య ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రమ్యను తప్పు పట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments