Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ ఆర్థిక మాజీ మంత్రి కరోనా పాజిటివ్!

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (08:35 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి అమిత్ మిత్రాకు ఈ వైరస్ సోకింది. సోమవారం ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
దీనిపై బెంగాల్ ప్రభుత్వ వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా కారణంగా మాజీ మంత్రి మిత్ర సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. 
 
కాగా, గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ అనేక ప్రపంచ దేశాల్లో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. మన దేశంలో కూడా విలయతాండవం చేసింది. దీంతో లాక్డౌన్‌ను అమలు చేశారు. ఈ వైరస్ 2020లో సద్దుమణిగినప్పటికీ ఆ తర్వాత రెండు, మూడు దశలుగా వ్యాపించి, గత యేడాది కాలంగా శాంతించింది. ఇపుడు మళ్ళీ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments