Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సైనికుడిగా నా రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:13 IST)
ఒక దేశ మాజీ సైనికుడిగా నాలోని రక్తం మరిగిపోతోందని భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపై వీకే సింగ్ స్పందించారు. 
 
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఆయన సంతాపం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యలా అభివర్ణించారు. ఓ పౌరుడిగా, సైనికుడిగా ఉగ్రవాదుల దురాగతాన్ని తలచుకుంటుంటే తన రక్తం మరిగిపోతోందని, ప్రతి రక్తపు బొట్టుకు ఉగ్రవాదులు ప్రతిఫలాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. జవాన్ల త్యాగాలకు 'సెల్యూట్' చేస్తున్నానని వీకే సింగ్ అన్నారు. 
 
మరోవైపు ఈ దాడిపై సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ మాట్లాడుతూ, పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఘటనా స్థలికి ఉన్నతాధికారులు వెళ్లారని, గాయపడ్డ జవాన్లను ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతున్న సీఆర్పీఎఫ్‌కి చెందిన 78 వాహనాల శ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారని చెప్పారు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు వారు వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments