Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో ఈటా వైరస్.. కర్నాటకలో తొలి కేసు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:04 IST)
దేశంలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ పేరు ఈటా. కర్నాటకలో తొలి కేసు నమోదైంది. కరోనా వైరస్ జన్యుమార్పిడి చెందడంతో ఈ వైరస్ అవతరించినట్టుగా గుర్తించారు. భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలకు విస్తరించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, బ్రిటన్ దేశంలో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్' తాజాగా మన దేశంలోకి కూడా ప్రవేశించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన ఈ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ గుర్తించారు. 
 
ఈయన నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లా మంగుళూరులోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో నిర్ధారణ పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిందని వివరించారు.
 
చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
 
జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపామని, ఆ వ్యక్తిలో కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments