దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (08:58 IST)
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో భారత్‌తో సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్‌తో సహా ఇతర ఇతర సహజవాయువుల కొరత ఏర్పడే అవకాశం ఉత్పన్నమైంది. ఈ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల దేశంలో చమురు కొరత ఏర్పడుతుందనే భయాలు అక్కర్లేదన్నారు. 
 
గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నానం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వైవిధభరితం చేశాం. ప్రస్తుతం మనకు వచ్చే సరఫరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదు అని మంత్రి వివరించారు. 
 
కాగా, భారత్ తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి హానికరం. విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడుతుంది. అయినప్పటికీ రష్యా, అమెరికాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ తన చమురు వనరులను వైవిధ్యభరితం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments