Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 8న ఢిల్లి శాసనసభకు ఎన్నికలు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:03 IST)
కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లి శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నేటినుంచి కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు.

శాసనసభలోని మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 14 వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆ రోజునుంచే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21వ తేదీ ఆఖరు రోజు అని ఆయన చెప్పారు.

24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజని ఆయన అన్నఆరు. ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి 90 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలింగగ్‌ కోసం మొత్తం 13767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments