Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావు

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:32 IST)
ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. 
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, ఈ యాత్ర సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి, యువ నేత సచిన్ పైలెట్ల మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని ఆయన స్పష్టంచేశారు. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని వారి మధ్య ఉన్నవికేవలం అభిప్రాయభేదాలు మాత్రమేనని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. 
 
రాజస్థాన్‌కు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ మహిళకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఒకటి రెండుసార్లు మినహా కాంగ్రెస్ ఎపుడూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోల మీద గుర్తుల మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments