Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం మోడీకి అప్పగించిన ఈసీ : చిదంబరం

గుజరాత్ రాష్ట్ర ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయ

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:59 IST)
గుజరాత్ రాష్ట్ర ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరు తీవ్రమైన విమర్శలకు దారితీస్తోందన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించక పోవడం వెనుక కారణమేంటంటూ నిలదీశారు. 
 
"ఈసీ తన సెలవులను పొడిగించుకుంది. గుజరాత్ ప్రభుత్వం అన్ని రకాల తాయిలాలు, రాయితీలు ప్రకటించిన తర్వాతే.. ఈసీకి మళ్లీ గుజరాత్ ఎన్నికలు గుర్తొస్తాయి.." అని చిదంబరం వ్యాఖ్యానించారు. అంతేకాదు గుజరాత్‌ ఎన్నికల తేదీ ప్రకటించే అధికారాన్ని ఈసీ ప్రధాని మోడీకి అప్పగించిందంటూ ఆరోపించారు. 'గుజరాత్‌లో తన చివరి ర్యాలీ సందర్భంగా మోడీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఈసీకి కూడా చెబుతారులే..' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
నిజానికి ఈనెల 12వ తేదీనే ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ రోజున కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తేదీలను వెల్లడించిన ఈసీ... గుజరాత్‌పై ఎన్నికల తేదీలపై మౌనం వహించింది. ఈ చర్యపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments