Webdunia - Bharat's app for daily news and videos

Install App

72 గంటల్లో ప్రధాని మోడీ ఫోటోలన్నీ తొలగించాలి.. ఈసీ ఆదేశం

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (08:45 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోటో తొలగించాలని ఆదేశాలుజారీచేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా. ఈ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా ఈసీ పేర్కొంది. పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు గత శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. 
 
కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో ప్రధాని మోడీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను వినియోగిస్తున్నారని, దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోడీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments