Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతకు ఇసి నోటీసులు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:50 IST)
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. ఎనిమిది దశల పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే అక్కడ మూడు దశలు ముగియగా... మరో ఐదు దశల పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార తృణమూల్‌, బిజెపిలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో పాటు... పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఓ మతాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఇసి నోటీసులు జారీ చేసింది.

ముస్లింలు ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు ఓటు వేయవద్దని, గంపగుత్తగా తమ పార్టీకే వేయాలని మమతా ఓటర్లను అభ్యర్థించారని బిజెపి నేత, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి ఇసికి ఫిర్యాదు చేశారు.

దీనిపై మోడీ కూడా స్పందిస్తూ... ఆమెలా మేము కూడా తమ హిందువులకే పిలుపునిస్తే... ఇసి ఊరుకుంటుందా... అంటూ బెంగాల్‌ ప్రచార సభల్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మమతకు ఇసి నుండి నోటీసు అందింది. దీనికి 48 గంటల్లోగా బదులివ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments