Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో స్వల్ప భూకంపం... రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:31 IST)
దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లడఖ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. లడఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. 
 
అర్థరాత్రి వేళ భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా భూమి కంపించింది. గురువారం అర్థరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అలాగే, జపాన్ కూడా భూమి కంపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments