Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిన మణిపూర్ - హిమాచల్ ప్రదేశ్ - రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (08:40 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ భూప్రకంపనలతో వణికిపోయింది. ఈ రాష్ట్రంలోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. ఉదయం 6.గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 
 
మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకుగురై తమ తమ నివాసాల నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. 
 
అయితే, ఈ భూప్రకపంనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఎన్‌సీఎస్‌ పేర్కొంది. అలాగే గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. 
 
ఉదయం 6.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13గంటలకు మరోసారి రిక్టర్‌ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments