Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిన మణిపూర్ - హిమాచల్ ప్రదేశ్ - రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (08:40 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ భూప్రకంపనలతో వణికిపోయింది. ఈ రాష్ట్రంలోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. ఉదయం 6.గంటల సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. 
 
మొయిరాంగ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 52 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకుగురై తమ తమ నివాసాల నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. 
 
అయితే, ఈ భూప్రకపంనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఎన్‌సీఎస్‌ పేర్కొంది. అలాగే గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. 
 
ఉదయం 6.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత 7.13గంటలకు మరోసారి రిక్టర్‌ స్కేల్‌పై 2.4 తీవ్రత ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. వరుస భూకంపాలతో జనం భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments