Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రైల్వే స్టేషనులో బాంబు అంటూ తాగుబోతు ఫోన్ కాల్

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:18 IST)
ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్ననేపథ్యంలో దేశ ప్రజల్లో ఆందోళన నెలకొని ఉంది. భారత్ జైషే మహమ్మద్ శిబిరాలపై దాడులు జరిపిన తర్వాత పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉండే ప్రధాన నగరాల్లో వచ్చే 72 గంటల పాటు హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఓ తాగుబోతు చేసిన పనికి చెన్నై పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు.
 
మంగళవారం నాడు చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బాంబు దాడి జరగబోతోందని చెప్పాడు. తన భార్య వేరెవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం విన్నానని, ఇందులో ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ని జల్లెడపట్టారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లభించకపోయేసరికి, అది కాస్తా ఫేక్ కాల్‌గా గుర్తించారు.
 
గతంలో కూడా ఇదే రైల్వే స్టేషన్‌లో బాంబు పేలిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీయగా, అతడు తేనాంపేటలో కార్పెంటర్‌గా పనిచేసే శరవణన్‌గా గుర్తించారు. భార్యతో ఉన్న విభేదాల కారణంగా, ఆమెపై కక్ష సాధించుకునేందుకు ఫేక్ కాల్ చేసి ఆమెను ఇందులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. కాగా తాగిన మత్తులోనే ఫేక్ కాల్ చేసాడని పోలీసులు ధృవీకరించారు. శరవణన్ భార్యకు అసలు విషయం ఏమీ తెలియదని, అతడిని మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments