డాక్టర్లపై దాడి చేస్తే 10 సంవత్సరాల జైలు, 5 లక్షల ఫైన్..

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (13:27 IST)
కేంద్ర వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. డాక్టర్లపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఇకపై ఫైన్ పడేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులు మరణిస్తే, వారి బంధువులు డాక్టర్లపై దాడికి దిగుతున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇదే అంశమై వైద్యులంతా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 
 
ప్రాణం పోసే డాక్టర్లపై దాడులకు పాల్పడటం, అలాగే ఆస్పత్రులను ధ్వంసం చేయడం సరికాదని వారు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ధర్నాలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇకపై డాక్టర్లపై దాడులకు పాల్పడితే, వారికి జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో ఫైన్ విధించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించిన మసాయిదా బిల్లును రూపొందించింది.
 
ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడి చేసిన వారిపై మూడు నుంచి పది సంవత్సరాల వరకూ జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం త్వరలో వెల్లడించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం వెల్లడించారు.
 
ఆస్పత్రుల్లో రోగుల బంధువులు హింసకు పాల్పడినా, విధ్వంసానికి పాల్పడినా నిందితులకు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలని.. అలాగే ఈ దాడులలో ధ్వంసమైన ఆస్పత్రి ఆస్తి విలువకు రెండు రెట్లు పరిహారం చెల్లించాలన్న నిబంధనను కూడా ముసాయిదాలో చేర్చినట్లు సమాచారం. 
 
ఆస్పత్రులలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లపై దాడులు జరగకుండా ఆపాలంటూ డాక్టర్ల నుంచి సుదీర్ఘ కాలంగా డిమాండ్‌ వస్తోందని మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments