Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూఢ నమ్మకానికి యువతి బలి - టైఫాయిడ్ జ్వరం వస్తే చర్నాకోలుతో కొట్టడంతో

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (09:33 IST)
హైటెక్ సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలు ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో మూఢ భక్తిభావం పేరుతో తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఇపుడు తమిళనాడు రాష్ట్రంలో ఓ కన్నతండ్రి మూఢ నమ్మకం కన్నబిడ్డ ప్రాణాలు తీసింది. పైగా, కుమార్తె ఆత్మ తన భార్యకు ఆవహించిందంటూ ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామనాథపురం జిల్లాకు చెందిన తరణి అనే యువతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ వచ్చింది. అంతకుమనుపు ఆమె పలు మార్లు తన తల్లి సమాధి వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆనారోగ్యం పాలైంది. 
 
అయితే.. బాధితురాలి తండ్రికి దయ్యాలు, భూతాలు ఉన్నాయనే నమ్ముతాడని మూఢనమ్మకాలు ఎక్కువని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చనిపోయిన తన భార్య ఆత్మ కూతురిని ఆవహించిందని తండ్రి బలంగా నమ్మాడు. భూతాన్ని వదిలించేందుకు తరణిని ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లాడు. 
 
ఆ భూత వైద్యుడు తరుణికి చర్నాకోలుతో కొట్టి.. పొగపెట్టడంతో.. ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె తండ్రి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్టు వెల్లడైంది. తదనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆమెకు టైఫాయిడ్ సోకినట్టు వెల్లడైంది. అయితే.. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments