Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అక్రమ సంబంధం బయటపెట్టేందుకు సి.సి. కెమెరాలు పెట్టిన భర్త.. ఆ తరువాత?

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (16:15 IST)
తన భార్య వేరొకరితో కలిసి ఉందన్న అనుమానం భర్తలో కలిగింది. భార్యను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుందామనుకున్నాడు. విషయాన్ని తన తల్లికి చెప్పాడు. ఆమె సలహాతో ఆఫీస్‌లో సి.సి.కెమెరాలు పెట్టించాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చే  భార్యపై అనుమానం బాగానే పెంచుకున్నాడు. విషయం కాస్త భార్యకు తెలియడంతో ఆమె భర్త, అత్తపై కోపంతో ఊగిపోయింది. ఇద్దరిని కలిపి చితకబాదింది. 
 
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఆకాష్, ఇషితలకు ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆకాష్‌ చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నాడు. ఇషిత కూడా ఛార్టెడ్ అకౌంటెంట్. భార్యను బిజినెస్ పార్టనర్‌గా చేసుకున్నాడు. అయితే ఆ ఆఫీస్‌లో పనిచేసే ఒక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తలో అనుమానం ఏర్పడింది.
 
దీంతో వారంరోజుల పాటు ఆఫీస్‌కు వెళ్ళకుండా సి.సి.కెమెరాలు పెట్టి అందులో నుంచి చూడటం మొదలెట్టాడు. ఉన్నట్లుండి ఆఫీస్‌లో సి.సి.కెమెరాలు రావడం.. భర్త ఆఫీస్‌కు అస్సలు రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా అత్త నుంచి సూటిపోటి మాటలు రావడంతో ఆమెలో కోపం మరింత పెరిగింది.
 
నిన్న రాత్రి ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. కరెంట్ పోవడంతో సి.సి.కెమెరాలు నిలిచిపోయాయి. అయితే తన భార్యే సి.సి. కెమెరాలను పనిచేయకుండా చేసిందన్న అనుమానంతో ఆకాష్ ఆమెను నిలదీశాడు. అత్త కూడా అందుకు వంతపాడింది. దీంతో ఇషితకు కోపం కట్టలు తెంచుకుంది. భర్తపై దాడి చేస్తూ అత్తను పక్కకు నెట్టేసింది. దీంతో ఆమె తలుపుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్తను కూడా చీపురుతో చెడామడా వాయించేసింది. దీంతో భర్త, అత్త ఇద్దరూ కలిసి పోలీస్టేషన్లో ఇషితపై ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments