పొట్టే లాకర్... కడుపులో కిలోన్నర బంగారు ఆభరణాలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (09:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. ఇందులో 90 నాణేలు, గొలుసులు, చెవిదుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాకు చెందిన 26 యేళ్ళ మహిళ ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్‌బ్యాండ్‌లు, వాచీలను కూడా మింగేసింది. ఇటీవల ఆమె ఆనారోగ్యంపాలైంది. దీంతో రాంపుర్హట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పొట్టను స్కాన్ చేసిన వైద్యులు... అందులోని వస్తువులను చూసి విస్తుపోయారు. 
 
పొట్టలో కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 90 నాణేలు, కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవి దుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ, తన కుమార్తెకు మతిస్థిమితం లేదనీ, గత కొన్ని రోజులుగా ఇంట్లోని వస్తువులు మాయమవుతూ వస్తున్నాయనీ, ఇపుడు ఏం జరిగిందో తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆపరేషన్ చేసి బంగారు ఆభరణాలను బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments