Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు .. అందుకే డోలో-650 మాత్రలు..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (22:17 IST)
ఒక ఫార్మా కంపెనీ తయారు చేసే 650 మాత్రలను వైద్యులు అత్యధిక మంది రోగులకు సిఫార్సు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ పిటిషన్ దాఖలు కాగా, దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
తేలికపాటి జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను వైద్యులు రాస్తున్నారంటే అందుకు కారణం ఆ మాత్రల తయారీదారులు వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లనేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 
 
"పైగా, ఇదేమీ వీనులవిందైన సంగీతం కాదు. నాకు కరోనా వచ్చినపుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ సంస్థ తరపున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. 
 
డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇలాంటి మందుల అతి వినియోగంతో రోగుల  ఆరోగ్యం డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments