Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు .. అందుకే డోలో-650 మాత్రలు..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (22:17 IST)
ఒక ఫార్మా కంపెనీ తయారు చేసే 650 మాత్రలను వైద్యులు అత్యధిక మంది రోగులకు సిఫార్సు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ పిటిషన్ దాఖలు కాగా, దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
తేలికపాటి జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను వైద్యులు రాస్తున్నారంటే అందుకు కారణం ఆ మాత్రల తయారీదారులు వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లనేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 
 
"పైగా, ఇదేమీ వీనులవిందైన సంగీతం కాదు. నాకు కరోనా వచ్చినపుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ సంస్థ తరపున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. 
 
డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇలాంటి మందుల అతి వినియోగంతో రోగుల  ఆరోగ్యం డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments