Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో కారును ఆపి దంపతులపై కాల్పులు.. ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 29 మే 2021 (10:16 IST)
సినీ ఫక్కీలో రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన భార్య మరణించారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో జరిగింది. నగరంలోని బిజీ క్రాసింగ్ వద్ద ఈ కాల్పుల ఘటన జరగడం శోచనీయం. సాయంత్రం 4.45 నిమిషాలకు సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
క్రాసింగ్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కారుకు అడ్డంగా నిలిచారు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న డాక్టర్‌.. కారు విండో తీస్తుండగానే.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపి.. బైక్‌పై పరారీ అయ్యారు. ప్రతీకారంతోనే ఆ డాక్టర్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
డాక్టర్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్న ఆ యువతిని హత్య చేశారు. డాక్టర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఆ యువతి సోదరుడిలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆమె తల్లి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments