Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో దక్షిణాది రాష్ట్రాల మద్యం వాటా ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 9 మే 2020 (20:19 IST)
ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే దాదాపు 50శాతం మద్యం వినియోగిస్తున్నారనీ, పన్నుల ద్వారా ఈ రాష్ట్రాలకు 10 నుంచి 15శాతం వరకు ఆదాయం వస్తున్నట్టు క్రిజిల్‌ రిపోర్టు వెల్లడించింది.

యావత్‌ దేశం మద్యం వినియోగంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటా 45 శాతంగా ఉన్నట్టు ఆ రిపోర్టు వెల్లడించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 15 శాతం ఆదాయంతో అగ్రభాగాన ఉన్నాయి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ లు చెరి 11శాతం, తెలంగాణ 10శాతం ఆదాయం పొందుతున్నాయని ఆ రిపోర్టు వెల్లడించింది. మద్యం ద్వారా వస్తోన్న ఆదాయంలో 12 శాతంతో ఢిల్లీ దేశంలో మూడోస్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం జాతీయ స్థాయిలో 4 శాతంగా ఉంది.

దేశంలో 13శాతం వినియోగం ఒక్క తమిళనాడులోనే ఉండగా, 12శాతంతో కర్ణాటక, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ (7శాతం), తెలంగాణ (6శాతం), కేరళ (5శాతం)ఉన్నాయి. 3.3 కోట్ల జనాభా ఉన్న కేరళ మద్యం విక్రయాలపై ఎక్కువ పన్నులతో అత్యధిక ఆదాయాన్ని పొందుతోంది.

దేశవ్యాప్తంగా ఐదు దక్షిణాది రాష్ట్రాలతో కలిపి, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ సహా 12 రాష్ట్రాలు 75శాతం మద్యాన్ని వినియోగిస్తున్నాయి. ఈ 12 రాష్ట్రాల్లోనే కోవిడ్‌ కేసులూ, మరణాలూ 85 శాతానికి పైగా ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments