Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు ఇవ్వను.. : కమల్‌హాసన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:32 IST)
‘మీ అందరికీ ఉచితంగా చేపల పులుసు వండిపెట్టను. అయితే యేడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇస్తాను. చేపలు పట్టే సామర్థ్యాన్ని అందిస్తాను’ అంటూ మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోని శివానంద కాలనీలో ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఉచిత తాయిలాల వల్ల రాష్ట్రంలో పేదరికం పోదని, ఉచితాలు తీసుకోవడమే పనిగాపెట్టుకునే ప్రభుత్వ రుణభారం పెరిగిపోతుందని అన్నారు.

ఈ రుణభారాన్ని నిరోధించడానికి అనువైన పరికరంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘మీ అందరికి ఉచితంగా ఒక రోజు చేపలపులుసు అందించి సంతృప్తిపరచాలని భావించడం లేదు. ఏడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇచ్చి మీరు సొంతంగా సంపాదించుకునేలా ఉండాలన్నదే మా పార్టీ ఆశయం’ అన్నారు. 

చేపలు పట్టే టెక్నిక్‌ తెలుసుకుంటే పదిమంది ఉచితంగా చేపల పులుసు ఇచ్చే స్థితికి చేరుకోగలరని కమల్‌ అన్నారు. తనను స్థానికేతరుడని మైలాపూరు అమ్మవారు (వానతి శ్రీనివాసన్‌) చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments