Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు ఇవ్వను.. : కమల్‌హాసన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:32 IST)
‘మీ అందరికీ ఉచితంగా చేపల పులుసు వండిపెట్టను. అయితే యేడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇస్తాను. చేపలు పట్టే సామర్థ్యాన్ని అందిస్తాను’ అంటూ మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోని శివానంద కాలనీలో ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఉచిత తాయిలాల వల్ల రాష్ట్రంలో పేదరికం పోదని, ఉచితాలు తీసుకోవడమే పనిగాపెట్టుకునే ప్రభుత్వ రుణభారం పెరిగిపోతుందని అన్నారు.

ఈ రుణభారాన్ని నిరోధించడానికి అనువైన పరికరంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘మీ అందరికి ఉచితంగా ఒక రోజు చేపలపులుసు అందించి సంతృప్తిపరచాలని భావించడం లేదు. ఏడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇచ్చి మీరు సొంతంగా సంపాదించుకునేలా ఉండాలన్నదే మా పార్టీ ఆశయం’ అన్నారు. 

చేపలు పట్టే టెక్నిక్‌ తెలుసుకుంటే పదిమంది ఉచితంగా చేపల పులుసు ఇచ్చే స్థితికి చేరుకోగలరని కమల్‌ అన్నారు. తనను స్థానికేతరుడని మైలాపూరు అమ్మవారు (వానతి శ్రీనివాసన్‌) చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments