Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు ఇవ్వను.. : కమల్‌హాసన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:32 IST)
‘మీ అందరికీ ఉచితంగా చేపల పులుసు వండిపెట్టను. అయితే యేడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇస్తాను. చేపలు పట్టే సామర్థ్యాన్ని అందిస్తాను’ అంటూ మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోని శివానంద కాలనీలో ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఉచిత తాయిలాల వల్ల రాష్ట్రంలో పేదరికం పోదని, ఉచితాలు తీసుకోవడమే పనిగాపెట్టుకునే ప్రభుత్వ రుణభారం పెరిగిపోతుందని అన్నారు.

ఈ రుణభారాన్ని నిరోధించడానికి అనువైన పరికరంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘మీ అందరికి ఉచితంగా ఒక రోజు చేపలపులుసు అందించి సంతృప్తిపరచాలని భావించడం లేదు. ఏడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇచ్చి మీరు సొంతంగా సంపాదించుకునేలా ఉండాలన్నదే మా పార్టీ ఆశయం’ అన్నారు. 

చేపలు పట్టే టెక్నిక్‌ తెలుసుకుంటే పదిమంది ఉచితంగా చేపల పులుసు ఇచ్చే స్థితికి చేరుకోగలరని కమల్‌ అన్నారు. తనను స్థానికేతరుడని మైలాపూరు అమ్మవారు (వానతి శ్రీనివాసన్‌) చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments