Webdunia - Bharat's app for daily news and videos

Install App

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

సెల్వి
సోమవారం, 5 మే 2025 (14:53 IST)
A Raja
తమిళనాడులోని మైలాడుదురైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎంపీ ఎ రాజా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం వీచిన బలమైన గాలుల కారణంగా వేదిక దగ్గర ఓవర్ హెడ్ లైట్లు పడిపోయాయి. వేదిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. స్టేజీ లైట్ ఆయనపై పడబోయింది.
 
ముందుగానే విషయం గుర్తించిన ఆయన క్షణాల్లోనే పక్కకు జరగ్గా.. మైకుపై లైటు కుప్పకూలింది. ఒకవేళ ఆ లైటు ఎంపీపై పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.  
 
ముఖ్యంగా ఆ భారీ స్టేజ్ లైట్ ఒక్కసారిగా ఎంపీ రాజాపైకి దూసుకురాగా.. ముందుగానే విషయం గుర్తించిన ఆయన ఒక్కసారిగా పక్కకు జరిగారు. అలా ఆయన జరిగిన కొన్ని సెకన్లలోనే లైట్ మైక్‌పై పడింది. దీంతో మైక్ విరగడంతో పాటు.. అక్కడి స్టేజీ కూడా అటూ ఇటూ కదిలింది. ఇలా తృటిలోనే ఎంపీ రాజా ఈ ప్రమాదం నుంచి బయట పడగా.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఊపిరి పీల్చున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments