Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వేల కోళ్లు, 300 మేకలు బలి... ఘాటు బిర్యానీ... చెన్నై షోలింగనల్లూర్ ఎమ్మెల్యే విందు భోజనం...

చెన్నైలో అంతే... చెన్నైలో అంతే... అనుకోవాల్సి వస్తుంది. ఇటీవలే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే దాదాపు అధికార పీఠానికి దగ్గరకు వచ్చి చతికిలపడింది. కానీ ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు మాత్రం అధికా

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (18:37 IST)
చెన్నైలో అంతే... చెన్నైలో అంతే... అనుకోవాల్సి వస్తుంది. ఇటీవలే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే దాదాపు అధికార పీఠానికి దగ్గరకు వచ్చి చతికిలపడింది. కానీ ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ సభ్యులపై గెలుపొందడంతో పండుగ చేసుకుంటున్నారు. దేనితో అనుకుంటున్నారు...? కోళ్లు, మేకలు బలి ఇచ్చి బిర్యానీలు వండుకు తింటున్నారు. తమిళనాడులోని షోలింగనల్లూర్ నియోజకవర్గం నుంచి డీఎంకెకు చెందిన అరవింద్ రమేష్ ఘన విజయం సాధించిన నేపథ్యంలోనూ, అలాగే ఎమ్మెల్యే కార్యాలయం పనులు పూర్తి కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం నాడు విందు ఏర్పాటు చేశారు. 
 
తనను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించాడు. అంతే... 2 వేల కోళ్లు, 300 మేకలు తెప్పించి, బలి ఇచ్చి ఆ మాంసంతో బిర్యానీ చేయించి అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఓ కళ్యాణమండపాన్ని ఆయన బుక్ చేశారు. దీనికిగాను సుమారు రూ. 2 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అన్నట్లు కార్యకర్తలు అన్నా... మాకు చుక్క పడందే ముక్క కొరకలేం అనగానే అడిగినవారికి లేదనకుండా మద్యం పార్టీ కూడా ఇచ్చారట. దటీజ్ తమిళ ఎమ్మెల్యే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments