Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రైళ్లను ఆపివేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (11:59 IST)
సాధారణంగా రైళ్లు వెళుతుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా దారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేస్తుంటారు. అయితే, బిహార్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఏకంగా రైళ్లనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలాసేవు రెడ్ సిగ్నల్ ఉండటంతో అనేక మంది ప్రయాణికులు రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో సీఎం నితీశ్ కుమార్ సమాధాన్ యాత్రను చేస్తున్నారు. ఇందులోభాగంగా, రైలు పట్టాలను ముఖ్యమంత్రి కాన్వాయ్ దాటాల్సివుంది. ఇందుకోసం రైళ్లను ఏకంగా 15 నిమిషాల పాటు నిలిపివేశారు. బక్సర్ రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద రెండు రైళ్లు నిలిచిపోయాయి. సీఎం వెళ్లిపోయిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికే విసుగెత్తిన ప్రయాణికులు కొందరు రైలు దిగి పట్టాల వెంబడి నడుచుకుంటూ బక్సర్ రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారు. ఈ చర్యను కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేపట్టింది సమాధాన్ యాత్ర కాదని విఘాత యాత్ర అని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం