Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిన్నర్ ఆఫర్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (15:34 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తుంది. ఇందులోభాగంగా ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇపుడు నెటిజన్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ వీడియోలను నెటిజన్లు షేర్ చేయాల్సి వుంటుంది. అలా ఎవరి వీడియోలైతే వైరల్ అవుతాయో వారిలోని 50 మందిని ఎంపిక చేసి వారితో డిన్నర్ చేస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు కూడా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా షేర్ చేస్తున్నారు. 
 
మరోవైపు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే, ప్రత్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నెలాఖరు వరకు ఈసీ నిషేధం విధించింది. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటమే. దీంతో సోషల్ మీడియా వేదిక ద్వారా అన్ని రాజకీయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments