దినకరన్‌కు వత్తాసు పలికిన ఆరుగురు అవుట్.. ఓపీఎస్, ఈపీఎస్ సీరియస్

ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురు అన్నాడీఎంకే నేతలను తొలగిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకేలో వారసత్వపు రాజ

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (14:33 IST)
ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురు అన్నాడీఎంకే నేతలను తొలగిస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకేలో వారసత్వపు రాజకీయాలకు తావుండదని... ఎంజీఆర్, అమ్మ బాటల్లోనే ఈ పార్టీ నడుస్తుందని.. అలా కాదని ఒక కుటుంబం చేతుల్లో పార్టీని నడిపించేందుకు టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నారని.. అలాంటిది జరిగే ప్రసక్తే లేదని ఓపీఎస్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 
 
ఓపీఎస్, ఈపీఎస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఐక్యంగా వున్నామన్నారు. అమ్మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమలో విబేధాలు సృష్టించేందుకు టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడని.. అతడు పలికే మాటలన్నీ అసత్యాలన్నారు. 
 
ఆర్కే నగర్‌‍లో మాయ చేసి గెలిచాడని.. అతడు చేసిన అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఓపీఎస్ వెల్లడించారు. అలాంటి వ్యక్తికి పార్టీ నుంచి సహకరించిన, పార్టీ నియమాలను ఉల్లంఘించిన వెట్రివేల్‌, తంగ త‌మిళ్ సెల్వ‌న్, రంగ స్వామి, ముత్త‌య్య‌, క‌లైరాజ‌న్‌, షోలింగూర్ పార్థిబ‌న్‌ల‌ను పార్టీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయా నేత‌లు టీటీవీ దినకరన్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ విష‌యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓపీఎస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments