తాగుబోతు జవాను సాహసం.. మిగిలిన జవాన్లకు ఆదర్శం.. జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు
ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శత్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న
ఓ తాగుబోతు జవాను చేసిన సాహసం మిగిలిన జవాన్లకు ఆదర్శంగా మారింది. ఫలితంగా వారికి ఇచ్చే ఆహారానికి కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శత్రువులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న జవాన్లకు పెడుతున్న ఆహారం బాగోలేదని ఇటీవలే తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
ఆ జవాను చేసిన ఆరోపణలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికారులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, బీఎస్ఎఫ్ నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు తాజాగా నాణ్యమైన ఆహారం అందించడానికి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై జవాన్లకు అందించే ఆహారంలో ఎటువంటి నాణ్యత కొరతా ఉండబోదని తెలుస్తోంది. అలాగే, కేంద్ర హోం శాఖ కూడా విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే.