Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (14:02 IST)
మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సన్నద్ధమైనట్లు సమాచారం. 
 
పాకిస్థాన్ అంతేనే మండిపడుతున్న శివసేన.. ఆ దేశానికి చెందిన కళాకారులను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌లో అడుగుపెట్టించేది లేదంటోంది. సోమవారం ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త, రచయిత సుధీంద్రకులకర్ణిపై దాడి జరిగింది. దీన్ని బీజేపీ ఖండిస్తున్నట్లు తెలియరావడంతో పాటు ఫడ్నవీస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉండటంతో శివసేన విడిపోవాలనుకుంటుంది. 
 
ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి కలిగివుండటంతో భవిష్యత్తులో శివసేనకు నష్టమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేగాకుండా మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేసే శివసేన బీజేపీతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భావిస్తోంది. ఇక శివసేన నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం తలెత్తే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments