Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్‌లో సెర్చ్ చేసి.. బాంద్రా వంతెన నుంచి దూకేశాడు.. ప్రేమించిన అమ్మాయికి?

తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యు

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (18:13 IST)
తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపారవేత్త కుమారుడు. ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి ఇతడిని ప్రేమిస్తుందా లేదా అనేది తెలియరాలేదు. 
 
ఇంతలో తాను ప్రేమించే అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం కుదిరిందని తెలిసి.. ముంబైలోని బాంద్రా వర్లీ వంతెన నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే పవన్ ఆత్మహత్యపై అతడి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎప్పుడూ చలాకీగా తిరిగే వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని బాధపడుతున్నారు. పవన్‌ ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నాడని.. ఆయన తండ్రి అతనికి ఓ ఆడీ కారును కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్ మరణించేందుకు ముందు సులభంగా ఆత్మహత్య చేసుకోవడం ఎలా అనేదానిపై స్మార్ట్ ఫోనులో సెర్చ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments