Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్‌ లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తరలించిన వ్యక్తి.. ఎక్కడ?

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటిక

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (09:08 IST)
ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లా రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. 
 
ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో కుమారుడు బైక్ తీసుకురాగా.. మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments