Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ లేదని చెప్పారు.. అంతే దాబాకే నిప్పంటించారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (11:22 IST)
చికెన్ లేకుంటే కొందరికి ముద్ద దిగదు. అలాంటి వ్యక్తి చికెన్ లేదని చెప్పిన దాబాకు నిప్పు అంటించాడు. అసలే తాగినమత్తులో ఉన్నవారు ఏకంగా దాబాకు నిప్పంటించేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19) ఇద్దరు ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం అర్దరాత్రి ఒంటిగంట సమయంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు. 
 
చికెన్ ఐటమ్ కోసం ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే ఆ దాబాలో చికెన్ అయిపోంది. దీంతో దాబా ఓనర్ వారికి చికెన్ దొరకదని సమాధానం ఇచ్చాడు.. అయితే శంకర్, సాగర్‌లు మాత్రం తమకు తప్పకుండా చికెన్ కావాలని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు. తినడానికి చికెన్ ఐటమ్స్ దొరకకపోవడంతో ఆవేశానికి లోనైన ఇద్దరు నిందితులు దాబాకు నిప్పంటించారు.
 
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

తర్వాతి కథనం
Show comments