Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపయోగం లేని ప్రసంగాలు ఆపండి : రాహుల్ ట్వీట్

ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (16:29 IST)
ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగాలు ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాలను ఆయన తూర్పారబట్టారు. ఉపయోగంలేని ప్రసంగాలను ఇకనైనా ఆపాలన్నారు.
 
మోడీ ప్రభుత్వం సామాన్యులను చాలా కష్టాలకు గురిచేస్తోందని రాహుల్ ఆవేదన చెందుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, తక్షణం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతాలో హిందీలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదంతా నాలుగు లైన్లలో ఓ పద్యాన్ని తలపించేలా ఉంది.
 
'అధిక ధరకు వంటగ్యాస్, ఖరీదైన రేషన్‌.. ఉపయోగంలేని ప్రసంగాలను ఆపండి! ధరలను తగ్గించండి, ఉద్యోగాలు ఇవ్వండి.. లేదంటే ఆ పదవి నుంచి తప్పుకోండి' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments