Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (11:28 IST)
రైల్వే స్టేషన్‌లలో ఉండే కొందరు పోర్టర్లు ఏమాత్రం మానవత్వం లేని వారిగా ప్రవర్తిస్తుంటారు. రైలు ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టిపీడిస్తుంటారు. తాజాగా ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఓ పోర్టర్ చేసిన పాడుపనికి రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేసి, పోర్టర్ బ్యాడ్జ్‌ను కూడా వెనక్కి తీసుకుంది. ఇంతకీ ఈ పోర్టర్ చేసిన పాడుపడి ఏంటంటే.. వీల్ చైర్ సర్వీస్ కోసం ఓ ఎన్నారై నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ ఎన్నారై కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు పోర్టర్ తీసుకున్న రూ.10 వేల డబ్బులో రూ.9 వేలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్‌లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. అయితే, గత నెల 28వ తేదీన తన తండ్రి నుంచి ఏకంగా రూ.10 వేలు వసూలు చేశారంటూ ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించి అతడి నుంచి రూ.9 వేలు వెనక్కి తీసుకుని ప్రయాణికుడికి అందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందిస్తూ, ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే కట్టుబడివుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రైల్వే శాఖ ప్రతిష్టను దిగజారుస్తాయని, ఇలాంటి సమస్యలు ఎదురైతే 139కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments