Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరిట మోసం.. సహజీవనం.. 21 మందిని అలా చేసేందుకు రెడీ..

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదుగురిని పెళ్లి పేరిట మోసం చేశాడు. అక్కడితో ఆగకుండా మరో 21మందిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన అభిషేక్ వశిష్ట్ అలియాస్ అభినవ్ అభిరుంద్రాంశ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. 
 
భర్తతో విడిపోయిన మహిళల వివరాలను సేకరించి.. వారితో స్నేహం చేసి.. ఆపై ప్రేమ పేరుతో వలలో వేసుకునే వాడు. చివరికి పెళ్లి చేసుకుని మోసం చేసేవాడు. తానో మీడియా హౌస్ ఓనర్ అని నమ్మించి.. ఈ పని అంతా కానిచ్చాడు. అయితే అభిషేక్ వశిష్ట్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు హరిద్వార్‌లో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిలో సహజీవనం చేస్తున్నాడు. అంతేకాకుండా మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో పెళ్లి కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments