Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుష్యంతో ఢిల్లీ రాజధాని నగరం ఉక్కిరిబిక్కిరి, 4 చక్రాల వాహనాలు నిషేధం

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (21:10 IST)
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా రాజధాని ఢిల్లీలో BS-III పెట్రోల్, BS-IV డీజిల్‌తో నడిచే ఫోర్-వీలర్లను నిషేధించారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయుకాలుష్యం అంతులేని సమస్యగా కొనసాగుతోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోంది. ఇది అక్కడ నివశిస్తున్న మానవకోటికి ప్రాణంతకంగా మారుతోంది.
 
వాహనాలు వెదజల్లుతున్న విషపూరిత పొగలు, ఢిల్లీ చుట్టూ జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల వాయుకాలుష్యం పెరిగిపోతోందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో, రైతులు పంట వ్యర్థాలను కాల్చడం కొనసాగిస్తున్నారు. ఇది కూడా వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని చెప్పారు.
 
ఈ పరిస్థితిలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 409కి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అనవసర నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అలాగే BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్లు అక్కడ నడపడం నిషేధించబడింది.
 
జాతీయ రక్షణ లేదా భద్రత, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు, ఆరోగ్యం, రైల్వేలు, మెట్రో రైలు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, విద్యుత్ సరఫరా, పైపులైన్లు, పారిశుద్ధ్యం మరియు నీటి సరఫరాకు సంబంధించిన నిర్మాణ పనులు నిషేధం నుండి మినహాయించబడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments