Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని అసెంబ్లీలో ఓ సొరంగ మార్గం.. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు..?

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (12:04 IST)
tunnel
దేశ రాజధాని ఢిల్లీలోని అసెంబ్లీలో ఓ సొరంగ మార్గం బయటపడింది. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా భారత స్వాతంత్ర్య సమరయోధులను తరలించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు. 
 
ఈ సందర్భంగా రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు తాను దీని గురించి వినేవాడినన్నారు. ఎర్రకోటకు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్టు చెప్పేవారని తెలిపారు. దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశానని కానీ అంత క్లారిటీ రాలేదన్నారు.
 
అయితే ఇప్పుడు ఆ టన్నెల్‌కు చెందిన ముఖ ప్రదేశాన్ని గుర్తించామని తెలిపారు. కానీ ఆ టన్నెల్‌ను ఇప్పుడు తొవ్వడం లేదని, ఎందుకుంటే ఆ మార్గంలో మెట్రో పిల్లర్లు, సీవేజ్ నిర్మాణాలు ఉంటాయని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో టన్నెల్ ప్రాంతాన్ని తాను సందర్శించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments