Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారికిరాకుంటే యాసిడ్ పోస్తా.. నీ కుమార్తెను చంపేస్తా.. ఐఏఎస్‌కు బెదిరింపులు

ఆమె ఓ ఐఏఎస్. జిల్లా కలెక్టర్‌గా పని చేసింది. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినా కూడా ఏమాత్రం బెరుకులేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్య

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (10:42 IST)
ఆమె ఓ ఐఏఎస్. జిల్లా కలెక్టర్‌గా పని చేసింది. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినా కూడా ఏమాత్రం బెరుకులేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించసాగాడు. అసభ్యకర మెసేజ్‌లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఇక వేధింపులు తట్టుకోలేని ఆ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్‌కు కార్యదర్శిగా సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి పని చేస్తోంది. గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్‌లోని ఓ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి బదిలీ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments