ఢిల్లీ లిక్కర్ స్కామ్ : నేడు మరోమారు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (11:06 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత గురువారం మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. 
 
గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరవుతారు. 
 
ఈ నెల 11వ తేదీన కవిత వద్ద సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు... ఈ నెల 16న మరోసారి రావాలని అదేరోజు సమన్లు జారీచేశారు. అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని కోరుతూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం ఆమె తరపున దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది. 
 
 
 
ఈ నెల 24వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం.. ఈ నెల 16న విచారణకు హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా, ఇదే అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవిత గురువారం మరోసారి ఆమె ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments