Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : నేడు మరోమారు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (11:06 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఎమ్మెల్సీ కె.కవిత గురువారం మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. 
 
గురువారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరవుతారు. 
 
ఈ నెల 11వ తేదీన కవిత వద్ద సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు... ఈ నెల 16న మరోసారి రావాలని అదేరోజు సమన్లు జారీచేశారు. అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని కోరుతూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం ఆమె తరపున దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది. 
 
 
 
ఈ నెల 24వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం.. ఈ నెల 16న విచారణకు హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా, ఇదే అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవిత గురువారం మరోసారి ఆమె ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments