Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ మాజీ డైరెక్టరుకు ఢిల్లీ హైకోర్టు అపరాధం.. ఎందుకంటే...

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:54 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తాత్కాలిక డైరెక్టరుగా అతి కొద్దికాలం పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వర రావుకు ఢిల్లీ హైకోర్టు ఫైన్ వేసింది. తన ట్విట్టర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలోనే నాగాశ్వర రావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా తనకు ఫలితం దక్కలేదని పేర్కొంటూ నాగేశ్వర రావు ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని పరిశీలించిన హైకోర్టు విచారణకు నిరాకరించింది. పైగా, ఒకే అంశంపై రెండుసార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నిలదీస్తూ అటు నాగేశ్వర రావుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే, ఆయనకు పదివేల రూపాయల అపరాధం కూడా విధించింది. అదేసమయంలో నాగేశ్వర రావు ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలంటూ ట్విట్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments