Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషులకు మరో పదేళ్ళ జైలుశిక్ష

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:43 IST)
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలిన వారికి ఢిల్లీ కోర్టు మరో పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. నిర్భయ సామూహిత అత్యాచార ఘటనకు ముందు ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్, రాంసింగ్‌‌లు ఓ కార్పెంటర్‌పై దాడికి దిగి అతడిని నిలువుదోపిడీ చేశారు. దీనిని ఢిల్లీ పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఢిల్లీ అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి రితేష్ సింగ్ నిందితులు నలుగురికి ఒక్కక్కరికి విడివిడిగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. 
 
కాగా, నిర్భయ కేసులో ఇప్పటికే వీరికి సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు అపెక్స్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలావుంచితే, నిర్భయ కేసులో ఒకడైన రాంసింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన 23 యేళ్ల పారామెడికల్ వైద్య విద్యార్థిని 2012 డిసెంబర్ 13వ తేదీన జుగుప్సాకరమైన రీతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన తర్వాత 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడి జీవన్మరణ పోరాటం చేసిన విషయంతెల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు